బీరుట్ : ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్పై ప్రత్యక్ష యుద్ధానికి తాను సిద్ధమని ఇరాన్ మద్దతు గల హెజ్బొల్లా తీవ్రవాద గ్రూపు ప్రకటించడంతో మంగళవారం దక్షిణ లెబనాన్లోకి ఇజ్రాయెల్ తన బలగాలను పంపింది. 80కిపైగా గ్రామాల ప్రజలను ఖాళీ చేయాలని ఆదేశించింది.
సోమవారం తెల్లవారుజామున ఉత్తర ఇజ్రాయెల్పైకి రాకెట్లు, డ్రోన్లను హెజ్బొల్లా ప్రయోగించగా ప్రతీకారంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు జరపడంతో లెబనాన్ రాజధాని బీరుట్ శివార్లలో 40 మంది మరణించారు. మృతుల్లో ఓ పాలస్తీనా తీవ్రవాది, హెజ్బొల్లా నిఘా అధికారి కూడా ఉన్నారు. ఈ దాడుల్లో 246 మంది గాయపడ్డారని, వేలాదిమంది నిరాశ్రయులయ్యారని లెబనాన్ ఆరోగ్య శాఖ మంగళవారం ప్రకటించింది.