టోక్యో: టోక్యో ఒలింపిక్స్ ( Tokyo Olympics ) పురుషుల హాకీలో ఇండియన్ జట్టు సెమీస్లో ఓడింది. బెల్జియం చేతిలో దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్లో బెల్జియం 5-2 గోల్స్ తేడాతో భారత్పై విజయం సాధించి ఫైనల్లో ప్రవేశించింది. ఈ మ్యాచ్లో ఓడిన ఇండియా .. రెండవ సెమీస్లో ఓడిన జట్టుతో బ్రాంజ్ మెడల్ కోసం మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. నిజానికి తొలి క్వార్టర్ లో ఇండియా పైచేయి సాధించింది. ఫస్ట్ హాఫ్లో మన్దీప్ సింగ్, హర్మన్ప్రీత్ సింగ్లు ఇండియాకు గోల్స్ చేశారు. అయితే బెల్జియం ఆటగాడు అలెగ్జాండర్ హెండ్రిక్స్ ఈ మ్యాచ్లో హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. రెండవ, మూడవ క్వార్టర్లో ఇరు జట్లు గట్టిగా పోరాడాయి. కానీ చివరి క్వార్టర్లో మాత్రం బెల్జియం తన సత్తా చాటింది. మ్యాచ్ దగ్గరపడుతున్న సమయంలో పుంజుకున్నది. నాలుగవ క్వార్టర్లో బెల్జియం ఏకంగా మూడు గోల్స్ చేసి ఇండియాకు షాకిచ్చింది. బెల్జియంను అడ్డుకోవడంలో భారత డిఫెన్స్ తడబడింది. కాంస్య పతకం కోసం ఆగస్టు 5వ తేదీన ఇండియా మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఇవాళ సాయంత్రం ఆస్ట్రేలియా, జర్మనీ మద్య జరిగే మ్యాచ్లో ఓడిన జట్టుతో భారత్ పోటీపడుతుంది.