సిలెట్(బంగ్లాదేశ్):ఆసియా టీ20 టోర్నీలో భారత మహిళల జట్టు ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. శనివారం బంగ్లాదేశ్తో జరిగిన లీగ్ మ్యాచ్లో టీమ్ఇండియా 59 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. దీంతో సెమీఫైనల్ చేరుకున్నారు. భారత్ నిర్దేశించిన 160 పరుగుల లక్ష్యఛేదనలో బంగ్లా 7 వికెట్లు కోల్పోయి 100 పరుగులకే పరిమితమైంది. షెఫాలీవర్మ (2/10) ,దీప్తిశర్మ (2/13) విజృంభణతో బంగ్లా బ్యాటర్లు తేలిపోయారు.
కెప్టెన్ నిగార్ సుల్తానా(36), ఫర్గాన హక్ (30) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. అంతకుముందు షెఫాలీవర్మ (55), స్మృతి మందన (47) రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 159/5 స్కోరు చేసింది. బంగ్లా బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొంటూ వీరిద్దరు తొలి వికెట్కు 96 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రుమాన అహ్మద్(3/27) ఆకట్టుకుంది. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో రాణించిన షెఫాలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. ఈనెల 10న భారత్ తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో థాయ్లాండ్తో తలపడుతుంది.