దోహా: ఫిఫా ప్రపంచకప్, ఆసియాకప్ సంయుక్త అర్హత టోర్నీలో మంగళవారం ఆఫ్ఘనిస్థాన్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ను భారత్ 1-1తో డ్రా చేసుకుంది. ఆఫ్ఘనిస్థాన్ గోల్కీపర్ ఒవైస్ అజీజి(75ని) తప్పిదంతో భారత్కు 1-0 ఆధిక్యం దక్కింది. అయితే స్వల్ప వ్యవధిలోనే హుస్సేన్ జమానీ గోల్తో ఆఫ్ఘన్ 1-1తో స్కోరు సమం చేసింది. మొత్తంగా ఎనిమిది మ్యాచ్ల్లో ఏడు పాయింట్లతో భారత్ గ్రూపు-ఈలో ఖతార్, ఒమన్ తర్వాత మూడో స్థానంలో నిలిచి ఆసియా(2023) కప్ మూడో రౌండ్ క్వాలిఫయర్స్కు అర్హత సాధించింది.