బెంగళూరు: ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ నెగ్గి ఇప్పటికే దక్షిణాసియా ఫుట్బాల్ చాంపియన్షిప్ సెమీఫైనల్కు దూసుకెళ్లిన భారత్.. మంగళవారం తమ చివరి లీగ్ మ్యాచ్లో కువైట్తో అమీతుమీ తేల్చుకోనుంది. తొలి మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్పై 4-0తో నెగ్గిన భారత్.. మలి పోరులో 2-0తో నేపాల్ను చిత్తుచేసింది.
భారత కెప్టెన్, స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛేత్రీ రెండు మ్యాచ్ల్లో కలిపి నాలుగు గోల్స్తో అదరగొట్టాడు. అందులో పాకిస్థాన్పై సాధించిన హ్యాట్రిక్ ఉండటం విశేషం. ఇదే జోరు కొనసాగిస్తూ.. అజేయంగా నాకౌట్లో అడుగు పెట్టాలని బారత జట్టు ఆశిస్తున్నది.