నేపియర్: భారత్కు 161 పరుగుల టార్గెట్ను విసిరింది న్యూజిలాండ్. నేపియర్లోని మెక్లీన్ పార్క్లో జరుగుతున్న మూడవ టీ20లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్ 160 రన్స్కు ఆలౌటైంది. కాన్వే, ఫిలిప్స్ హాఫ్ సెంచరీలతో న్యూజిలాండ్కు గౌరవ ప్రదమైన స్కోర్ను అందించారు. కాన్వే 59, ఫిలిప్స్ 54 రన్స్ చేశారు. నిజానికి భారీ స్కోర్ దిశగా వెళ్తున్న కివీస్ను భారత బౌలర్లు అడ్డుకున్నారు.
.@arshdeepsinghh put on a brilliant show with the ball and claimed a fine 4⃣-wicket haul 👏👏
Live – https://t.co/rUlivZ308H #TeamIndia | #NZvIND pic.twitter.com/bbecP4pN6h
— BCCI (@BCCI) November 22, 2022
తొలుత టాస్ గెలిచిన కివీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకున్నది. ఓపెనర్ అలెన్ వికెట్ను త్వరగానే కోల్పోయింది. ఆ తర్వాత చాప్మెన్ కూడా ఔటయ్యాడు. కానీ మూడవ వికెట్కు కాన్వే, ఫిలిప్స్ మధ్య కీలక భాగస్వామ్యం నెలకొన్నది. ఆ ఇద్దరూ మూడో వికెట్కు 86 రన్స్ జోడించారు.
4⃣overs
1⃣7⃣runs
4⃣wicketsAn impressive four-wicket haul for @mdsirajofficial 👏👏
Live – https://t.co/rUlivZ2sj9 #TeamIndia | #NZvIND pic.twitter.com/DitzJcrWJp
— BCCI (@BCCI) November 22, 2022
ఇక చివర్లో పరుగులు రాబట్టే ప్రయత్నంలో న్యూజిలాండ్ త్వరత్వరగా వికెట్లను కోల్పోయింది. చివరలో కేవలం 30 రన్స్ మాత్రమే చేసి 8 వికెట్లను కోల్పోయింది న్యూజిలాండ్. భారత బౌలర్లలో హర్షదీప్, సిరాజ్లు నాలుగేసి వికెట్లు తీసుకున్నారు.