టోక్యో: పారాలింపిక్స్లో ఒకే రోజు ఇండియా ఖాతాలో రెండో సిల్వర్ మెడల్ చేరింది. ఆదివారం ఉదయం టేబుల్ టెన్నిస్లో భవీనా పటేల్ సిల్వర్ సాధించి చరిత్ర సృష్టించగా.. ఇప్పుడు మెన్స్ హైజంప్ టీ47 ఫైనల్లో ఇండియాకు చెందిన నిషాద్ కుమార్( Nishad Kumar ) కూడా సిల్వర్ మెడల్ గెలిచాడు. ఫైనల్లో తన అత్యుత్తమ వ్యక్తిగత ప్రదర్శన అయిన 2.06 మీటర్ల ఎత్తు దూకిన నిషాద్.. రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. తొలి ప్రయత్నంలో విఫలమైనా.. రెండో ప్రయత్నంలో సాధించాడు. ఈ మెడల్తో టోక్యో పారాలింపిక్స్లో భారత్ పతకాల సంఖ్య రెండుకి చేరింది.