AFC Asia Cup : ప్రతిష్ఠాత్మక ఏఎఫ్సీ ఆసియా కప్(AFC Asia Cup) పోటీలకు భారత జట్టు సిద్ధమవుతోంది. సొంతగడ్డపై వరుస విజయాలతో జోరుమీదున్న సునీల్ ఛెత్రీ(Sunil Chhetri) సేన ఐదోసారైనా ట్రోఫీని ముద్దాడాలనే పట్టుదలతో ఉంది. టోర్నీకి మరో 13 రోజులే ఉండడంతో హెడ్కోచ్ ఇగొర్ స్టిమాక్(Igor Stimac) 26మందితో కూడిన బృందాన్ని ప్రకటించాడు. ఇందులో ముగ్గురు గోల్ కీపర్లు, ఎనిమింది డిఫెండర్లు, తొమ్మిది మంది మిడ్ఫీల్డర్లు, ఆరుగరు ఫార్వర్డ్లు ఉన్నారు. అయితే.. ఈ టోర్నమెంట్ కోసం 50 మంది ప్రాపబుల్స్కు ఎంపిక చేసినప్పటికీ.. చివరకు 26మందికి మాత్రమే తుది బృందంలో చోటు దక్కింది.
గోల్ కీపర్లు – అమరిందర్ సింగ్, గుర్ప్రీత్ సింగ్ సంధు, విశాల్ కైత్.
డిఫెండర్లు – ఆకాశ్ మిశ్రా, లాల్చుంగుంగ, మెహ్తాబ్ సింగ్, నిఖిల్ పూజారి, ప్రీతమ్ కొటల్, రాహుల్ భేకె, సందేశ్ ఝింగాన్, సుభాశిష్ బోస్.
మిడ్ఫీల్డర్లు – అనిరుధ్ థాపా, బ్రాండన్ ఫెర్నాండేస్, దీపక్ తంగ్రి, లలెంగ్మావియా రాల్టే, లిస్టన్ కొలాకో, నవొరెమ్ మహేశ్ సింగ్, సహల్ అబ్దుల్ సమద్, సురేశ్ సింగ్ వాంగ్జమ్, ఉదంతా సింగ్.
ఫార్వర్డ్లు – ఇషాన్ పండిత, లల్లియన్జులా, ఛాంగ్టే, మన్వీర్ సింగ్, రాహుల్ కన్నోలి ప్రవీణ్, సునీల్ ఛెత్రీ, విక్రమ్ ప్రతాప్ సింగ్.
జనవరి 13న దోహాలో ఆసియా కప్ టోర్నీ షురూ కానుంది. గ్రూప్ బిలో ఉన్న భారత్ తొలిపోరులో బలమైన ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. అనంతరం జనవరి 18న ఉజ్జెకిస్థాన్తో, 23వ తేదీన సిరియాతో ఛెత్రీ సేన అమీతుమీ తేల్చుకోనుంది. ఈ టోర్నీలో ఒక్కసారి మాత్రమే ఫైనల్ చేరిన భారత్ రన్నరప్తో సరిపెట్టుకుంది. అయితే.. ఈ సారి సొంతగడ్డపై అద్భుత విజయాలతో టాప్ 100కు చేరువైన టీమిండియా గట్టి పోటీ ఇవ్వాలనే కసితో ఉంది.