HYD Metro | నూతన సంవత్సరం సందర్భంగా ప్రయాణీకులకు హైదరాబాద్ మెట్రో శుభాకాంక్షలు తెలిపింది. డిసెంబర్ 31న ఆదివారం అర్ధరాత్రి 12.15 గంటల వరకు మెట్రో రైలు సర్వీసులు నడపనున్నట్లు మెట్రో ఎండీ శ్రీధర్ తెలిపారు. చివరి మెట్రో రైలు 12.15 గంటలకు బయలుదేరి ఒంటిగంటకు గమ్యస్థానాలకు చేరుతుందని పేర్కొన్నారు. స్టేషన్లలో భద్రత విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. మెట్రో రైలు, స్టేషన్లలో సిబ్బంది, పోలీసుల నిఘా ఉంటుందన్నారు. ప్రయాణీకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. మెట్రో స్టేషన్లలోకి మద్యం తాగి వచ్చినా, దుర్భాషలాడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.