ముంబై: ఈ నెల ఆరంభంలో మాంచెస్టర్లో ఇంగ్లండ్తో జరగాల్సిన అయిదవ టెస్టు మ్యాచ్ ఆఖరి నిమిషంలో రద్దు అయిన విషయం తెలిసిందే. అయితే ఆ టెస్టు మ్యాచ్ను 2022లో నిర్వహించేందుకు ఇంగ్లండ్, ఇండియా క్రికెట్ బోర్డులు అంగీకరించినట్లు తెలుస్తోంది. తాజాగా ముగిసిన టెస్టు సిరీస్లో ఇండియా 2-1 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. చివరి మ్యాచ్ రద్దు కావడంతో.. ఆ సిరీస్ను ఇండియా నెగ్గినట్లు అధికారికంగా ప్రకటించలేదు. వచ్చే ఏడాది జూలైలో ఆ రద్దు అయిన మ్యాచ్ను నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలిసింది. టీమిండియా సిబ్బందిలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కావడం వల్లే .. చివరి మ్యాచ్ను వదులుకుంటున్నట్లు బీసీసీఐ చెప్పిన విషయం తెలిసిందే.