యోచియన్(దక్షిణకొరియా) : ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ చాంపియన్షిప్ను భారత్ ఘనంగా ముగించింది. బుధవారం జరిగిన మహిళల 4X400 మీటర్ల ఫైనల్ రేసులో అనుష్క, రియాన్, కనిస్తా, రెజోనాతో కూడిన భారత బృందం 3:40:50 సెకన్ల టైమింగ్తో స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. కజకిస్థాన్, కొరియా జట్లకు వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కాయి.
మరోవైపు మహిళల 1500మీటర్ల ఫైనల్లో లక్షిత 4:24:23 సెకన్ల టైమింగ్తో భారత్కు స్వర్ణాన్ని అందించింది. పురుషుల విభాగంలో మెహదీ హసన్(3:56:01సె) కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు. పురుషుల 4X400 మీటర్ల తుది రేసులో దీపక్సింగ్, శరణ్, రిహాన్ చౌదరీ, నవ్ప్రీత్సింగ్ 3:08:79సె టైమింగ్తో రజతం సొంతం చేసుకున్నారు. టోర్నీలో భారత్ 6 స్వర్ణాలు, 7 రజతాలు, 6 కాంస్య పతకాలతో మూడో స్థానంలో నిలిచింది. విజేతలను జాతీయ కోచ్ నాగపురి రమేశ్ అభినందించారు.