కార్డిఫ్: మహిళల టీ20 ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్లో భారత్ సత్తా చాటింది. సోమవారం జరిగిన తొలి పోరులో 26 పరుగుల తేడాతో వెస్టిండీస్పై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగుల భారీ స్కోరు చేసింది.భారతి ఫుల్మాలి (56 నాటౌట్) అర్ధ శతకంతో సత్తా చాటగా.. ఓపెనర్లు స్మృతి మంధాన (39), షెఫాలీ వర్మ (29), యస్తికా భాటియా (36) కూడా రాణించారు.
అనంతరం చేధనలో విండీస్ ఓవర్లన్నీ ఆడి 153/8 స్కోరు మాత్రమే చేసి ఓడింది. ఓపెనర్ డాటిన్ (49) పోరాడినా. భారత స్పిన్నర్లు శ్రేయాంకా పాటిల్ (4/36), రాధా యాదవ్ (3/25) పదునైన బౌలింగ్తో దెబ్బతీశారు. ఈనెల 14న పాకిస్థాన్తో జరిగే ప్రపంచకప్ తొలి మ్యాచ్కు ముందు భారత్ బుధవారం తన చివరి వార్మప్ మ్యాచ్లో ఆతిథ్య ఇంగ్ల్లండ్తో తలపడనుంది.