IND vs AUS : సిరీస్ డిసైడర్ అయిన నాలుగో టీ20లో భారత జట్టు(Team India) అదరగొట్టింది. ఆఖరి ఓవర్ వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ఆస్ట్రేలియా (Australia)ను 20 పరుగుల తేడాతో మట్టికరిపించింది. వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురైన ఓటమికి యువ భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మూడో విజయంతో ఐదు టీ20ల సిరీస్(T20 Series)ను కైవసం చేసుకుంది. ఆఖరి ఓవర్లో 31 పరుగులు అవసరమవగా.. అవేశ్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి జట్టును గెలిపించాడు. ఆసీస్ కెప్టెన్ మాథ్యూ వేడ్(36 నాటౌట్) చివరిదాకా పోరాడినా ఫలితం లేకపోయింది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లతో రాణించాడు.
🇮🇳 3-1 🇦🇺
India wrap up the series in Raipur 🏆 https://t.co/TV0h5GA5ZD | #INDvAUS pic.twitter.com/UU0MnNvudY
— ESPNcricinfo (@ESPNcricinfo) December 1, 2023
రాయ్చూర్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు కొట్టింది. ప్రధాన ఆటగాళ్లు చేతులెత్తేయడంతో రింకూ సింగ్(46 : 29 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. టాపార్డర్లో రుతురాజ్ గైక్వాడ్(32), యశస్వీ జైస్వాల్(37 : 28 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్సర్) ఫర్వాలేదనిపించారు. ఆసీస్ బౌలర్లలో బెన్ డ్వార్షుయిస్ మూడు, బెహ్రెన్డార్ఫ్ రెండు వికెట్లు తీశారు.
రింకూ సింగ్(46)
175 పరుగుల ఛేదనలో ఆస్ట్రేలియాకు ఆది నుంచి తడబడింది. స్పిన్నర్లు బిష్ణోయ్, అక్షర్ పటేల్ మూడు కీలక వికెట్లు తీసి కంగారూలను దెబ్బకొట్టారు. మొదట జోష్ ఫిలిప్పే(8)ను బిష్ణోయ్ అద్భుత బంతితో బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్(31)ను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు. ఆ వెంటనే అరోన్ హర్డీ(8)ని అక్షర్ బౌల్డ్ చేసి రెండో వికెట్ ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత డేంజర్ టిమ్ డేవిడ్(19)ను అవేశ్ ఖాన్ వెనక్కి పంపాడు. అక్కడితో ఆసీస్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.