భువనేశ్వర్: హాకీ జూనియర్ ప్రపంచ కప్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన భారత్ క్వార్టర్ ఫైనల్స్కు దూసుకెళ్లింది. 8-2 గోల్స్తో పోలాండ్ను చిత్తు చేసి రెండో విజయంతో ఎలాంటి సమీకరణలు లేకుండానే ముందడుగు వేసింది. పూల్ ‘బి’ లీగ్ మ్యాచ్లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్లో పోలాండ్పై తిరుగులేని ఆధిపత్య ప్రదర్శన కనబర్చింది. గత మ్యాచ్ హ్యాట్రిక్ వీరులు సంజయ్ కుమార్ (4వ, 58వ నిమిషం), అరైజీత్సింగ్ హుందల్ (8వ, 60వ ని.) రెండు గోల్స్ చేయగా వారికి తోడుగా ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ సుదీప్ చిర్మాకో (24వ, 40 ని.) కూడా గోల్స్ మోత మోగించాడు. ఉత్తమ్ సింగ్ (34వ), శర్దానంద్ తివారీ (38) చెరో గోల్ చేశారు. ఆట ఆరంభం నుంచి భారత ఆటగాళ్లు ప్రత్యర్థి పోస్ట్పై దండయాత్ర చేశారు. పోలాండ్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. రెండంటే రెండు గోల్స్ (50, 54వ ని.) చేసి ఘోర పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. క్వార్టర్స్లో ఆదివారం బెల్జియంతో భారత్ తలపడనుంది. తొలి మ్యాచ్ ఫ్రాన్స్ చేతిలో ఓడిన భారత్, రెండో మ్యాచ్లో కెనడాను చిత్తు చిత్తుగా ఓడించింది. రెండో విజయంతో పాయింట్ల పట్టికలో భారత్ రెండో స్థానంలో స్థిరంగా ఉంది.