IND vs AUS : రెండో వన్డేలో భారత జట్టు(Team India) ఘన విజయం సాధించింది. ఆల్రౌండ్ షోతో ఆస్ట్రేలియాను 99 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. అశ్విన్, జడేజా మూడేసి వికెట్లతో చేలరేగడడంతో 400 పరుగుల భారీ ఛేదనలో ఆసీస్ 217 రన్స్కే పరిమితమైంది. ఈ విజయంతో, మరో మ్యాచ్ ఉండగానే టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. ఆసీస్ బ్యాటర్లో డేవిడ్ వార్నర్(53), సియాన్ అబాట్(54) మాత్రమే రాణించారు.
మొదట ఆడిన టీమిండియా 5 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది. ఆసీస్ పేసర్లను ఉతికారసిన ఓపెనర్ శుభ్మన్ గిల్(104), శ్రేయస్ అయ్యర్(105) సెంచరీలతో చెలరేగారు. వీళ్లిద్దరూ రెండో వికెట్కు రికార్డు స్థాయిలో 200 పరుగులు జోడించారు. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్(72 నాటౌట్) కెప్టెన్ కేఎల్ రాహుల్(52 ) దంచి కొట్టారు. దాంతో, 399 రన్స్ చేసింది. వన్డే ఫార్మాట్లో ఆస్ట్రేలియాపై టీమిండియాకు ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం.
శుభ్మన్ గిల్(104), శ్రేయస్ అయ్యర్(105)
భారీ ఛేదనలో ఆసీస్ 9 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ప్రసిద్ కృష్ణ తన తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో ఓపెనర్ మాథ్యూ షార్ట్(9), స్టీవ్ స్మిత్(0)లను ఔట్ చేశాడు. అయితే.. హ్యాట్రిక్ బంతికి లబూషేన్ ఒక పరుగు తీశాడు. 9వ ఓవర్ తర్వాత వాన పడింది. దాంతో, అంపైర్లు డక్వర్త్ లూయిస్ ప్రకారం ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ను 33 ఓవర్లకు కుదించారు. ఆసీస్ లక్ష్యాన్ని 317 పరుగులుగా నిర్దేశించారు.
వాన తగ్గాక మళ్లీ ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా టకటకా మూడు వికెట్లు కోల్పోయింది. అశ్విన్ మొదట మార్నస్ లబూషేన్(27)ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో డేంజరస్ డేవిడ్ వార్నర్(53), జోష్ ఇంగ్లిస్(6)ను ఎల్బీగా వెనక్కి పంపాడు. దాంతో, ఆసీస్ 101 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కామెరూన్ గ్రీన్(19), అలెక్స్ క్యారీ(14) ఔటయ్యాక సియాన్ అబాట్(54), హేజిల్వుడ్ అసమాన పోరాటంతో స్కోర్ 200 దాటించారు.