సిల్హట్: బంగ్లాదేశ్లో జరుగుతున్న మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్ ఫైనల్లోకి ఇండియా జట్టు ప్రవేశించింది. ఇవాళ జరిగిన మ్యాచ్లో థాయిలాండ్పై 74 పరుగుల తేడాతో భారత్ నెగ్గింది. ఆసియా కప్ ఫైనల్లోకి మహిళల జట్టు ప్రవేశించడం ఇది వరుసగా ఎనిమిదోసారి. నాలుగు సార్లు వన్డేల్లో, నాలుగు సార్లు టీ20 ఫైనల్లో ఇండియా ఆడింది. సెమీస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 రన్స్ చేసింది. ఇండియన్ జట్టులో షఫాలీ వర్మ అత్యధికంగా 42 రన్స్ చేసింది. హర్మన్ప్రీత్ కౌర్ 36, రోడ్రిగ్స్ 27 రన్స్ చేశారు. ఇక లక్ష్య చేధనలో థాయిలాండ్ విఫలమైంది. ఆ జట్టులో ఇద్దరు బ్యాటర్లు మాత్రమే రెండు అంకెల స్కోర్ చేశారు. 20 ఓవర్లలో 9 వికెట్లకు థాయ్ కేవలం 74 రన్స్ మాత్రమే చేసింది.