పల్లెకెలె: బౌలర్లు సత్తాచాటడంతో శ్రీలంకతో శుక్రవారం జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన లంక 48.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. నీలాక్షి (43) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో దీప్తి శర్మ, రేణుక సింగ్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యఛేదనలో మన అమ్మాయిలు 38 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేశారు. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (44), షఫాలీ వర్మ (35), హర్లీన్ డియోల్ (34) రాణించారు. బౌలింగ్లో మూడు వికెట్లు పడగొట్టడంతో పాటు అజేయంగా 22 పరుగులు చేసిన దీప్తి శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య సోమవారం రెండో వన్డే జరుగనుంది.