దుబాయ్: ఆసియా మిక్స్డ్ టీమ్ చాంపియన్షిప్లో భారత్ బోణీ కొట్టింది. మంగళవారం తొలి పోరులో భారత్ 5-0తో కజకిస్థాన్పై విజయం సాధించింది. స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ అదరగొట్టారు. తొలుత మిక్స్డ్ డబుల్స్లో తనీషా-ఇషాన్ జంట గెలుపొందగా.. పురుషుల సింగిల్స్లో ప్రణయ్ 21-9, 21-11తో దిమిత్రిపై నెగ్గాడు.
మహిళల సింగిల్స్లో పీవీ సింధు 21-4, 21-12తో కమిలాపై విజయం సాధించింది. సింధు పదునైన స్మాష్ల ధాటికి ప్రత్యర్థి ఉక్కిరిబిక్కిరి కాగా.. 20 నిమిషాల్లోపే మ్యాచ్ ముగిసింది. అప్పటికే భారత్ 3-0తో గెలుపొందగా.. పురుషుల డబుల్స్లో కృష్ణ ప్రసాద్-విష్ణువర్ధన్ గౌడ్, మహిళల డబుల్స్లో గాయత్రి గోపీచంద్-త్రిసా జాలీ జోడీలు విజయం సాధించాయి.