సిట్జెస్(స్పెయిన్): మహిళల చెస్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత్ క్వార్టర్స్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన చివరి ప్రీలిమినరీ రౌండ్ గేమ్లో భారత్ 3-1 తేడాతో ఫ్రాన్స్పై విజయం సాధించింది. దీంతో పూల్-ఏలో రెండో స్థానంలో నిలిచి కజకిస్థాన్తో క్వార్టర్స్ పోరుకు సిద్ధమైంది. ఫ్రాన్స్తో పోరులో భక్తి కులకర్ణి 51 ఎత్తుల్లో నటాషాపై, మారీఆన్ గోమెస్ 51 ఎత్తుల్లో సిల్వియా అలెక్సియాపై, హారిక 45 ఎత్తుల్లో మారి సెబాగ్పై విజయాలు నమోదు చేసుకున్నారు.