Team India | సిల్హెట్: ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడేందుకు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన భారత మహిళల జట్టు మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే 3-0 తో సిరీస్ సొంతం చేసుకుంది. సిల్హెట్ వేదికగా ముగిసిన మూడో టీ20లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లా.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 117 పరుగులే చేసింది. డిలారా అక్తర్ (39) టాప్ స్కోరర్ కాగా భారత బౌలర్లు సమిష్టిగా రాణించి ప్రత్యర్థిని నిలువరించారు. అనంతరం ఛేదనను భారత్ 18.3 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి పూర్తిచేసింది. షషాలీ వర్మ (51), స్మృతి మంధాన (47) ధాటిగా ఆడారు.