భోపాల్ : ఐఎస్ఎస్ఎఫ్ పిస్టల్-రైఫిల్ ప్రపంచ కప్లో బుధవారం భారత్కు ఒక స్వర్ణం, ఒక కాంస్య పతకం దక్కాయి. పురుషుల ఎయిర్ పిస్టల్ విభాగంలో సరబ్జోత్ స్వర్ణ పతకం గెలుచుకోగా, అదే అంశంలో వరుణ్ తోమర్ కాంస్య పతకం దక్కించుకున్నాడు.
కాగా మహిళా షూటర్లు తొలి రోజు పతకం సాధించడంలో విఫలమయ్యారు. 2021 ప్రపంచ జూనియర్ చాంపియన్ అయిన సరబ్జోత్ ఫైనల్ పోరులో 585 పాయింట్లతో 16-0 తేడాతో అజర్బైజాన్కు చెందిన రస్లాన్ లునెవ్ను ఓడించాడు. చైనాకు చెందిన లియు జిన్యావో 584 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. వరుణ్ తోమర్ 579 పాయింట్లు సాధించాడు.