చాటోగ్రామ్: బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో.. ఇండియాకు 5 పెనాల్టీ రన్స్ వచ్చాయి. 112వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. తైజుల్ బౌలింగ్లో అశ్విన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఈ సంఘటన చోటుచేసుకున్నది. అశ్విన్ బంతిని థార్డ్మ్యాన్ దిశగా ఆడాడు.. అయితే క్రీజ్లో ఉన్న కుల్దీప్, అశ్విన్లు రెండు రన్స్ తీశారు. కానీ బంగ్లాదేశ్ ఆ బంతిని కీపర్కు విసిరేసిన సమయంలో ఓ గమ్మత్తు జరిగింది. వికెట్ కీపర్ నురుల్ హసన్ వెనుక ఉన్న హెల్మెట్లకు ఆ త్రో వేసిన బంతి తగిలింది. క్రికెట్ రూల్స్ ప్రకారం.. ఇండియాకు 5 పెనాల్టీ రన్స్ ఇచ్చారు. ఆ ఘటనకు చెందిన వీడియో ఇదే.
5 penalty runs were awarded to India.pic.twitter.com/H9ECVqbSon#INDvsBangladesh | #BANvsIND | #BANvIND
— Saikat Ghosh (@Ghosh_Analysis) December 15, 2022