కాన్పూర్: న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో ఇండియా తన తొలి ఇన్నింగ్స్లో 345 పరుగులకు ఆలౌటైంది. ఇండియన్ ఇన్నింగ్స్లో శ్రేయస్ అయ్యర్(105) సెంచరీ చేయగా.. కివీస్ బౌలర్ టిమ్ సౌథీ తన ఖాతాలో అయిదు వికెట్లు వేసుకున్నాడు. 258 పరుగులు వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇండియా.. కేవలం 87 రన్స్ జోడించింది. లోయర్ ఆర్డర్లో అశ్విన్ 38 రన్స్ చేసి కొంత ఊరటనిచ్చాడు. ఇండియన్ ఇన్నింగ్స్లో శుభమన్ గిల్ 52, పుజారా 26, రహానే 35, జడేజా 50 రన్స్ చేశారు. కివీస్ బౌలర్లలో జేమిసన్ మూడు, పటేల్ రెండు వికెట్లు తీసుకున్నారు. న్యూజిలాండ్ తన తొలి ఇన్నింగ్స్ను ఆరంభించింది.