ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 290 l భారత్ రెండో ఇన్నింగ్స్ 43/0
లండన్: బౌలర్లకు సహకరిస్తున్న పిచ్పై ఇంగ్లండ్ మిడిలార్డర్ నిలదొక్కుకోవడంతో భారత్తో జరుగుతున్న నాలుగో టెస్టు రసపట్టుకు చేరింది. టాపార్డర్ విఫలమైనా.. మిగిలినవాళ్లు రాణించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్లో 290 పరుగులు చేసింది. ఒలీ పోప్ (81), క్రిస్ వోక్స్ (50) అర్ధశతకాలు సాధించగా.. జానీ బెయిర్స్టో (37), మొయిన్ అలీ (35) ఫర్వాలేదనిపించడంతో ఇంగ్లిష్ జట్టు 99 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించగలిగింది. 62/5తో కష్టాల్లో పడ్డ ఇంగ్లండ్ను పోప్, అలీ, వోక్స్ ఆదుకున్నారు. చివరి ఐదు వికెట్లకు ఇంగ్లండ్ 228 పరుగులు జతచేయడం విశేషం. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 3, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్ఇండియా శుక్రవారం ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. చేతిలో 10 వికెట్లు ఉన్న టీమ్ఇండియా.. ఇంగ్లండ్ తొలి స్కోరుకు ఇంకా 56 పరుగులు వెనుకబడి ఉంది. రోహిత్ శర్మ (20), కేఎల్ రాహుల్ (22) క్రీజులో ఉన్నారు.
62/5 నుంచి.. 290/10
ఓవర్నైట్ స్కోరు 53/3తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. రెండో ఓవర్లోనే ఓవర్టన్ (1) వికెట్ కోల్పోయింది. కాసేపటికే మలన్ (31) కూడా పెవిలియన్ బాటపట్టాడు. ఈ రెండు వికెట్లు ఉమేశ్ ఖాతాలోకే వెళ్లాయి. దీంతో ఇంగ్లండ్ 62 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇంకేముంది మరికాసేపట్లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగియడం ఖాయమే అనుకుంటున్న దశలో.. మిడిలార్డర్ సత్తాచాటింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో పోప్ హ్యాట్రిక్ ఫోర్లు అరుసుకుంటే.. తదుపరి ఓవర్లో సిరాజ్కు బెయిర్స్టో అదే శిక్ష వేశాడు. ఈ దెబ్బతో ఇంగ్లండ్పై నుంచి ఒత్తిడి దూరం కాగా.. అక్కడి నుంచి రెండు సెషన్ల పాటు ఇంగ్లిష్ బ్యాట్స్మెన్ అదే జోరు కొనసాగించారు. ఆరో వికెట్కు 89 పరుగులు జోడించాక బెయిర్స్టోను ఔట్ చేయడం ద్వారా సిరాజ్ ఈ జోడీని విడదీయగా.. ఆ తర్వాత మోయిన్ అలీ అండతో పోప్ రెచ్చిపోయాడు. ఏడో వికెట్కు 71 పరుగులు జతచేశాక అలీ ఔట్ కాగా.. సెంచరీ చేసేలా కనిపించిన పోప్ను శార్దూల్ బుట్టలో వేసుకున్నాడు. అయినా ఆఖర్లో బౌండ్రీలతో విరుచుకుపడిన క్రిస్ వోక్స్ జట్టుకు మంచి ఆధిక్యాన్ని అందించాడు.
స్కోరు బోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 191, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: బర్న్స్ (బి) బుమ్రా 5, హమీద్ (సి) పంత్ (బి) బుమ్రా 0, మలన్ (సి) రోహిత్ (బి) ఉమేశ్ 31, రూట్ (బి) ఉమేశ్ 21, ఓవర్టన్ (సి) కోహ్లీ (బి) ఉమేశ్ 1, పోప్ (బి) శార్దూల్ 81, బెయిర్స్టో (ఎల్బీ) సిరాజ్ 37, అలీ (సి) రోహిత్ (బి) జడేజా 35, వోక్స్ (రనౌట్) 50, రాబిన్సన్ (బి) జడేజా 5, అండర్సన్ (నాటౌట్) 1, ఎక్స్ట్రాలు: 23, మొత్తం: 290, వికెట్ల పతనం: 1-5, 2-6, 3-52, 4-53, 5-62, 6-151, 7-222, 8-250, 9-255, 10-290, బౌలింగ్: ఉమేశ్ 19-2-76-3, బుమ్రా 21-6-67-2, శార్దూల్ 15-2-54-1, సిరాజ్ 12-4-42-1, జడేజా 17-1-36-2.
భారత్ రెండో ఇన్నింగ్స్: రోహిత్ (నాటౌట్) 20, రాహుల్ (నాటౌట్) 22, ఎక్స్ట్రాలు: 1, మొత్తం: 43/0. బౌలింగ్: అండర్సన్ 6-1-13-0, రాబిన్సన్ 4-0-21-0, వోక్స్ 5-1-8-0, ఓవర్టన్ 1-0-1-0.