క్రైస్ట్చర్చ్ : మహిళ వన్డే ప్రపంచ కప్లో టీమిండియా పోరాటం ముగిసింది. ఆదివారం సౌతాఫ్రికాతో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో భారత్ 3 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ సారి ఎలాగైనా విశ్వవిజేతగా నిలువాలన్న మిథాలీ సేన కల నెరవేరలేదు. సెమీస్లో ప్రవేశించాలంటే గెలువాల్సిన చివరి లీగ్ మ్యాచ్లో అనవసర తప్పిదాలతో మిథాలీసేన భారీ మూల్యం చెల్లించుకొని ఇంటిదారి పట్టింది.
అంతకు ముందు బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసి దక్షిణాఫ్రికా ముందు 275 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు స్మృతి మంధాన (84 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్తో 71), షెఫాలీ వర్మ (46 బంతుల్లో 8 ఫోర్లతో 53) అర్ధ శతకాలతో శుభారంభం చేశారు. కెప్టెన్ మిథాలీ రాజ్ (84 బంతుల్లో 8 ఫోర్లతో 68), హర్మన్ ప్రీత్ కౌర్ (57 బంతుల్లో 4 ఫోర్లతో 48) రాణించారు.
సౌతాఫ్రికా బౌలర్లలో మసాబటా క్లాస్, షబ్నిమ్ ఇస్మైల్ చెరో రెండు వికెట్లు తీయగా.. క్లో ట్రియన్, అయాబొంగా ఖాకా తలో వికెట్ పడగొట్టారు. ఆ తర్వాత భారీ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ప్రోటీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 275 పరుగులు చేసి విజయం సాధించింది. ఓపెనర్ లౌరా(79 బంతుల్లో 11 ఫోర్లతో 80), మిగ్నో డూప్రీజ్(63 బంతుల్లో 2 ఫోర్లతో 52 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్ రెండు వికెట్లు తీయగా.. హర్మన్ ప్రీత్ కౌర్ రెండు వికెట్లు తీసింది. ముగ్గురు బ్యాటర్లు రనౌటయ్యారు.
మ్యాచ్ చివరి ఓవర్ ఉత్కంఠగా సాగింది. దక్షిణాఫ్రికాకు ఆరు బంతుల్లో 7 పరుగులు అవసరం కాగా.. కెప్టెన్ మిథాలీ.. చివరి ఓవర్ను దీప్తి శర్మకు ఇచ్చింది. తొలి బంతికి సింగిల్ ఇచ్చిన దీప్తి.. రెండో బంతికి సింగిల్ ఇవ్వడంతో పాటు బ్యాటర్ త్రిషా శెట్టిని రనౌట్ చేసింది. దీంతో మ్యాచ్పై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఆ తర్వాత మరో రెండు బంతులకు రెండు సింగిల్స్ ఇవ్వడంతో చివరి రెండు బంతులకు దక్షిణాఫ్రికా మూడు పరుగులు అవసమయ్యాయి.
ఇక ఐదో బంతికి క్రీజులో కుదురుకున్న బ్యాటర్ డూప్రీజ్ భారీ షాట్ ఆడగా.. లాంగాన్లో హర్మన్ ప్రీత్ కౌర్ క్యాచ్ అందుకున్నది. దీంతో భారత ఆటగాళ్లు సంబురంలో మునిగిపోయారు.. ఇక విజయం లాంఛనమేనని భావించారు. అయితే, అదే సమయంలో అంపైర్ నో బాల్గా ప్రకటించడంతో భారత శిబిరంలో ఆనందం ఆవిరైంది. ఇక చివరి రెండు బంతులకు రెండు పరుగులు అవసరం కాగా.. ప్రోటిస్ బ్యాటర్లు ఐదు పరుగులు చేసి విజయాన్ని అందుకున్నారు. టీంమిడియా ఓటమితో వెస్టిండిస్ సెమీఫైనల్స్కు వెళ్లింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్లు నాకౌట్కు చేరాయి.
Update: India’s campaign in the #CWC22 comes to an end. South Africa needed 1 off the final ball and managed to score the winning run.
Details ▶️ https://t.co/BWw8yYwlOS#TeamIndia | #CWC22 | #INDvSA pic.twitter.com/1EoGNKtujO
— BCCI Women (@BCCIWomen) March 27, 2022