హైదరాబాద్: మహిళల ప్రకప్లో (Women’s World Cup ) భాగంగా పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు ఆచితూచి ఆడారు. నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేశారు. పాక్ ముందు 245 పరుగుల విజలక్ష్యాన్ని ఉంచారు. టాస్గెలిచి బ్యాంటింగ్ ఎంచుకున్న భారత్ మొదటల్లో తబడింది. టాపర్డర్ విఫలమైనప్పటికీ పూజా వస్త్రాకర్(67), స్నేహ్ రానా(53 నాటౌట్) రాణించడంతో భారీ స్కోర్ చేయగలిగింది.
మ్యాచ్ రెండో ఓవర్లోనే షఫాలీ డకౌట్ అయింది. అయితే మరో వికెట్ పడకుండా స్మృతి మందాన (52), దీప్తి శర్మ(40) జాగ్రత్తగా ఆడారు. ఈ క్రమంలో అర్ధశతకం పూర్తిచేసుకున్న మందాన, దీప్తి శర్మ వెంటవెంటనే ఔటయ్యారు. తర్వాత వచ్చిన మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్, రిజా ఘోష్ ఎక్కువసేపు క్రీజ్లో నిలువలేకపోయారు.
అయితే స్నేహా రాణా (48 బల్స్లో 53 రన్స్), పూజా (59 బంతుల్లో 67 పరుగులు) పాక్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నారు. ఆరు వికెట్లు కోల్పోయి 114 దశ నుంచి జట్టు స్కోరును 245కు తీసుకువచ్చారు. పాక్ బౌలర్లలో నిదా దార్, నష్రా సంధు తలో రెండు, దియానా బాగ్, అనమ్ అమిన్, ఫాతిమా సానా ఒక్కో వికెట్ చొప్పున తీశారు.