ఆల్రౌండర్ దీపక్ హుడా ఈసారి బంతితో సత్తాచాటాడు. రెండో వన్డేలో జింబాబ్వే ఇన్నింగ్స్కు వెన్నెముకలా మారి నిలకడగా ఆడుతున్న షాన్ విలియమ్స్ (42)ను పెవిలియన్ చేర్చాడు. అర్ధశతకం సాధించేలా కనిపించిన విలియమ్స్.. హుడా వేసిన బంతిని భారీ సిక్సర్ బాదేందుకు ప్రయత్నించాడు. అయితే బంతికి అతని స్ట్రైక్ సరిగా కనెక్ట్ కాలేదు. దీంతో గాల్లోకి లేచిన బంతిని బ్యాక్వర్డ్ స్క్వేర్ లెగ్లో ఫీల్డింగ్ చేస్తున్న ధవన్ సులభంగా అందుకున్నాడు. జింబాబ్వే జట్టు 28 ఓవర్లు ముగిసేసరికి 105/6 స్కోరుతో నిలిచింది.