మూడు వన్డేల సిరీస్లో భాగంగా భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో వన్డేలో యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ.. భారత జట్టుకు బ్రేక్ ఇచ్చాడు. ఒక ఎండ్ నుంచి మహమ్మద్ సిరాజ్, మరో ఎండ్ నుంచి శార్దూల్ ఠాకూర్ వేస్తున్న బంతులను సమర్ధవంతంగా ఎదుర్కొన్న విండీస్ ఓపెనర్లు.. మంచి ఆరంభం అందుకున్నట్లే కనిపించారు. బ్రాండన్ కింగ్ (18) నెమ్మదిగా భారీ షాట్లు ఆడటం ప్రారంభించాడు.
ఇలాంటి సమయంలో రోహిత్ శర్మ వ్యూహం మార్చాడు. శార్దూల్ బదులుగా ప్రసిద్ధ్ కృష్ణకు బంతిని అందించాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టిన కృష్ణ.. తన తొలి ఓవర్ మూడో బంతికే ప్రమాదకరంగా మారుతున్న బ్రాండన్ కింగ్ను పెవిలియన్ చేర్చాడు. ఆఫ్ వికెట్ ఆవలగా వేసిన బంతి ఎక్స్ట్రా బౌన్స్ అయింది. దీన్ని కింగ్ సరిగా అంచనా వేయలేకపోవడంతో ఎడ్జ్ తీసుకున్న బంతిపి పంత్ చక్కగా అందుకున్నాడు. దీంతో కింగ్ ఇన్నింగ్స్ ముగిసింది. 237 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ జట్టు.. 8 ఓవర్లు ముగిసే సరికి 34/1 స్కోరుతో నిలిచింది.