వెస్టిండీస్తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు ఉత్కంఠభరిత విజయం సాధించింది. 308 పరుగుల టార్గెట్ సెట్ చేసినా కూడా కేవలం మూడు పరుగుల తేడాతోనే విజయం సాధించగలిగింది. లక్ష్య ఛేదనలో కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్ చేసిన అద్భుతమైన హాఫ్ సెంచరీలు వృధా అయ్యాయి. ఈ మ్యాచ్లో చివరి ఓవర్లో 15 పరుగులు కావలసి ఉండగా.. యువ పేసర్ మహమ్మద్ సిరాజ్కు ఆ ఓవర్ ఇచ్చారు.
దీనిపై చాహల్ మాట్లాడుతూ.. 15 పరుగులను సిరాజ్ కాపాడగలడనే నమ్మకం తమకుందన్నాడు. అంతకుముందు ఓవర్లలో కూడా తను మంచి యార్కర్లు వేశాడని. ఆ తర్వాత వైడ్ బంతికి పరుగులు రాకుండా సంజూ శాంసన్ ఆపడంతో తమ కాన్ఫిడెన్స్ మరింత పెరిగిందని చెప్పాడు. విండీస్ బ్యాటర్లు అద్భుతంగా ఆడుతుండటంతో కొంత ఒత్తిడికి లోనయ్యామని, కానీ సిరాజ్పై నమ్మకముంచామని వివరించాడు. సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చెయ్యడంతో మూడు పరుగుల తేడాతో భారత జట్టు మ్యాచ్ గెలిచింది.