తొలుత భారత బౌలర్ల అదిరిపోయే ప్రదర్శనతో విధ్వంసకర వెస్టిండీస్ను స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన టీమిండియా.. ఆ తర్వాత చిన్న టార్గెట్ను విజయవంతంగా ఛేదించి, మూడు వన్డేల సిరీస్లో తొలి విజయాన్ని నమోదు చేసింది. లక్ష్య ఛేదనలో లభించిన అదిరిపోయే ఆరంభాన్ని టీమిండియా సద్వినియోగం చేసుకోలేకపోయింది. రోహిత్ (60), ఇషాన్ కిషన్ (28) మంచి ఆరంభం అందించారు.
కానీ రోహిత్ అవుటైన తర్వాత కోహ్లీ (8) అనవసర షాట్కు యత్నించి అవుటయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే ఇషాన్ కిషన్ పెవిలియన్ చేరగా.. సూర్యకుమార్ యాదవ్ కొట్టిన స్ట్రెయిట్ షాట్కు దురదృష్టవశాత్తూ రిషభ్ పంత్ (11) బలయ్యాడు. దీంతో 116/4తో భారత జట్టు కష్టాల్లో పడింది. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (34 నాటౌట్), దీపక్ హుడా (26 నాటౌట్) చూడముచ్చటైక క్రికెట్ ఆడారు.
ఎక్కడా చెత్త షాట్లకు వెళ్లకుండా సంయమనంతో ఆడుతూ.. భారత జట్టును విజయతీరాలకు చేర్చారు. 28వ ఓవర్ చివరి బంతికి ఫోర్ కొట్టిన సూర్యకుమార్.. భారత్కు విజయాన్నందించాడు. దీంతో టీమిండియా విండీస్పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. విండీస్ బౌలర్లలో అకీల్ హొస్సేన్ ఒక వికెట్ తీయగా, జోసెఫ్ రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.