వెస్టిండీస్తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ ముందు స్వల్పలక్ష్యమే నిలిచింది. దీంతో అనవసర రిస్క్ తీసుకోకుండా నిలకడగా ఆడాలని రోహిత్ టీం నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. 177 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఓపెనర్లు రోహిత్ శర్మ (46 నాటౌట్), ఇషాన్ కిషన్ (14 నాటౌట్) జట్టుకు మంచి ఆరంభాన్నందించారు. వీరిద్దరూ చాలా సంయమనంతో ఆడుతూ.. ప్రతి ఓవర్లోనూ కనీసం ఒక బౌండరీ ఉండేలా చూసుకుంటున్నారు. దీంతో భారత జట్టు పది ఓవర్లు ముగిసే సమయానికి వికెట్లేమీ నష్టపోకుండా 67 పరుగులు చేసింది.
కాగా, కరోనా సోకడంతో శిఖర్ ధావన్, వ్యక్తిగత కారణాలతో కేఎల్ రాహుల్ ఈ వన్డేకు దూరమైన సంగతి తెలిసిందే. అలాగే సౌతాఫ్రికా నుంచి ఆలస్యంగా భారత్కు తిరిగొచ్చిన మయాంక్ అగర్వాల్ ఇంకా క్వారంటైన్లోనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో రోహిత్తో కలిసి ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ ఓపెన్ చేశాడు.