ప్రధాన బ్యాటర్లంతా తక్కువ స్కోర్లకే నిష్క్రమించిన వేళ.. టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ జట్టుకు అండగా నిలిచాడు. హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. వెస్టిండీస్తో జరుగుతున్న రెండో వన్డేలో కెప్టెన్ రోహిత్ (5), పంత్ (18), కోహ్లీ (18) తక్కువ స్కోర్లకే అవుటవడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. అలాంటి సమయంలో కేఎల్ రాహుల్ (49)తో కలిసి సూర్యకుమార్ యాదవ్ (51 నాటౌట్) జట్టును ఆదుకున్నాడు.
ఆచితూచి ఆడుతూ జట్టు స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. అయితే రెండో పరుగు తీసే సమయంలో అనవసరంగా ఒక క్షణం ఆగిన రాహుల్ అర్ధశతకానికి ఒక పరుగు దూరంలో అవుటయ్యాడు. దీంతో జట్టు భారం సూర్యకుమార్ భుజాలపై పడింది. ఈ క్రమంలోనే జోసెఫ్ వేసిన 36వ ఓవర్లో సింగిల్తో అర్ధశతకం పూర్తిచేసుకున్నాడు స్కై.