విండీస్తో జరుగుతున్న రెండో వన్డేలో అర్ధశతకంతో ఆకట్టుకున్న సూర్యకుమార్ యాదవ్ (64) పెవిలియన్ చేరాడు. అలెన్ వేసిన బంతిని స్వీప్ చేయడానికి అతను ప్రయత్నించాడు. కానీ బంతి అంత ఫుల్గా వేయకపోవడంతో సూర్య బాట్ టాప్ ఎడ్జ్ తీసుకుంది. షార్ట్ ఫైన్ లెగ్ దిశగా వచ్చిన సులభమైన క్యాచ్ను హోల్డర్ అందుకున్నాడు. దీంతో సూర్యకుమార్ చూడముచ్చటైన ఇన్నింగ్స్ ముగిసింది.
ఇది సూర్య వన్డే కెరీర్లో అత్యుత్తమ స్కోరు. ఇంతకుముందు శ్రీలంకపై చేసిన 53 పరుగుల స్కోరును అతను ఈ మ్యాచ్లో అధిగమించాడు. సూర్య అవుటవడంతో క్రీజులోకి దీపక్ హుడా వచ్చాడు. 39 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 178/5 స్కోరుతో నిలిచింది. ఈ పిచ్పై కనీసం 250 పరుగులైనా చేస్తే పోరాడవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్రమంలో భారత జట్టు ఆ మాత్రం స్కోరయినా చేస్తుందో లేదో చూడాలి.
#WestIndies got the man they wanted! The celebration shows it all! #SKY departs!
Come on #TeamIndia #INDvWI #INDvsWI #WIvIND #WIvsIND #Cricket pic.twitter.com/6JLDr9BTQC— BlueCap 🇮🇳 (@IndianzCricket) February 9, 2022