భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండీస్ బ్యాటర్లు పెవిలియన్కు క్యూ కడుతున్నారు. క్రీజులో ఉండటం అసలు ఇష్టం లేనట్లు వచ్చిన వాళ్లు వచ్చినట్లే వెనుతిరుగుతున్నారు. షాయి హోప్ (8), బ్రాండన్ కింగ్ (13), డారెన్ బ్రావో (18), షామర్ బ్రూక్స్ (12), నికోలస్ పూరన్ (18), కీరన్ పొలార్డ్ (0) ఎవరూ భారత బౌలింగ్ను ప్రతిఘటించకుండానే పెవిలియన్ చేరారు.
ఈ క్రమంలో భారత యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ మరో వికెట్ తీశాడు. విండీస్ స్పిన్నర్, అప్పుడప్పుడూ లోయర్ ఆర్డర్లో భారీ షాట్లతో విరుచుకుపడే అకీల్ హొస్సేన్ (0) అవుట్ చేశాడు. ప్రసిద్ధ్ బౌలింగ్ వేసిన 23వ ఓవర్ ఐదో బంతిని పుష్ చేయడానికి అతను ప్రయత్నించాడు. కానీ ఆ బంతి.. బ్యాటును తాకి వెనక్కు వెళ్లింది. తన ముందుకొచ్చిన క్యాచ్ను అందుకోవడానికి డైవ్ చేసిన పంత్.. అద్భుతమైన లో క్యాచ్ పట్టేశాడు.
దీంతో హొస్సేన్ డకౌట్గా వెనుతిరిగాడు. 25 ఓవర్లు ముగిసే సరికి విండీస్ జట్టు స్కోరు 89/7గా ఉంది. ఈ లెక్కన వాళ్లు కనీసం వంద పరుగులైనా చేస్తారా? అని అభిమానులు అంచనా వేస్తున్నారు.