వరుస వికెట్లు కోల్పోయి కనీసం వంద పరుగులైనా చేస్తుందా? అనే పరిస్థితిలో ఉన్న వెస్టిండీస్ను ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ (52 నాటౌట్) ఆదుకున్నాడు. అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరుగుతున్న భారత్-వెస్టిండీస్ తొలి వన్డేలో అర్ధశతకంతో ఆకట్టుకున్నాడీ విండీస్ ప్లేయర్. ప్రధాన బ్యాటర్లంతా పెవిలియన్కు క్యూ కట్టిన వేళ 8వ నెంబర్ ఆటగాడైన ఫాబియాన్ అలెన్ (29 నాటౌట్)తో కలిసి జట్టును ఆదుకున్నాడు.
ప్రత్యర్థికి ముచ్చెమటలు పట్టిస్తున్న భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ అర్ధశతకం సాధించాడు. అతని వల్లే 79/7తో నిలిచిన జట్టు.. హోల్డర్, అలెన్ల భాగస్వామ్యంతో మరో వికెట్ కోల్పోకుండా 157 స్కోరుకు చేరింది. అయితే 37వ ఓవర్ చివరి బంతికి అలెన్ను అవుట్ చేసిన వాషింగ్టన్ సుందర్ ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు.
అలెన్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్ను చక్కగా అందుకున్న సుందర్.. అతన్ని పెవిలియన్ చేర్చాడు. దీంతో విండీస్ జట్టు 38 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది.