వచ్చే నెలలో జరిగే భారత్, వెస్టిండీస్ సిరీస్లో విండీస్ జట్టు బాగా ఆడుతుందని ఆ జట్టు మాజీ కెప్టెన్ డారెన్ సామి ఆశాభావం వ్యక్తం చేశాడు. భారత్లో విండీస్ జట్టు గెలిచే అవకాశం ఉందా? అని ఎవరో అడిగిన ప్రశ్నకు ఈ మాజీ కెప్టెన్ బదులిచ్చాడు.
తన దృష్టిలో విండీస్ జట్టు బాగా ఆడే అవకాశం ఉందని, ముఖ్యంగా విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ కచ్చితంగా తన చాన్సెస్ తీసుకుంటాడని సామి చెప్పాడు. భారత్లో చాలా కాలంగా పొలార్డ్ ఆడుతున్నాడని, అక్కడి పరిస్థితులు పొలార్డ్కు చాలా బాగా తెలుసని అన్నాడు. అదే సమయంలో విండీస్ జట్టు కొత్త ట్యాలెంట్లను గుర్తించిందన్నాడు.
లెజెండ్స్ లీగ్ సందర్భంగా మాట్లాడిన సామి.. విండీస్పై గెలవడం భారత జట్టుకు అంత సులభం కాదన్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్ సిరీస్లో కొత్త ఆటగాళ్లు వెలుగు చూశారని, వీరంతా కలిసి భారత్కు గట్టిపోటీ ఇస్తారని అభిప్రాయపడ్డాడుడ.