వెస్టిండీస్తో జరుగుతున్న రెండో వన్డేలో భారత జట్టు స్కోరు వంద పరుగులు దాటింది. కేఎల్ రాహుల్ (33 నాటౌట్). సూర్యకుమార్ యాదవ్ (30 నాటౌట్) ఇద్దరూ ఆచితూచి ఆడుతూస్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్తున్నారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
తొలి వన్డేలో అర్ధశతకంతో ఆకట్టుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ (5) స్వల్పస్కోరుకే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (18), ఈ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన రిషభ్ పంత్ (18) కూడా నిరాశపరిచారు. ఇలాంటి సమయంలో సూర్య, రాహుల్ కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు. ఈ క్రమంలోనే 26వ ఓవర్లో చివరి రెండు బంతులకు రెండు బౌండరీలు బాదిన రాహుల్.. జట్టు స్కోరును 100 దాటించాడు.