విండీస్తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రధాన బ్యాటర్లు విఫలమవడంతో భారం మిడిలార్డర్పై పడింది. సూర్యకుమార్ అవుటైన తర్వాత 42వ ఓవర్లో వాషింగ్టన్ సుందర్ (24) అవుటయ్యాడు. అకీల్ హొస్సేబ్ బౌలింగ్లో జోసెఫ్కు క్యాచ్ ఇచ్చిన సుందర్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శార్దూల్ ఠాకూర్ (8) నిరాశపరిచాడు.
జోసెఫ్ వేసిన 46వ ఓవర్లో ఏమాత్రం కంట్రోల్ కనబరచలేకపోయిన శార్దూల్.. ఆ ఓవర్ చివరి బంతికి ఏమాత్రం కదలకుండా బలంగా బాదేందుకు ప్రయత్నించాడు. అయితే టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతిని పాయింట్ వద్ద బ్రూక్స్ అందుకున్నాడు. దీంతో అతని ఇన్నింగ్స్ ముగిసింది. శార్దూల్ అవుటవడంతో దీపక్ హుడా(29 నాటౌట్)కు సిరాజ్ (3) తోడు కలిశాడు. అతను కూడా 48వ ఓవర్ మూడో బంతికి ఎక్స్ట్రా బౌన్స్ను అంచనా వేయలేకపోయిన సిరాజ్.. కీపర్ హోప్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 49వ ఓవర్ తొలి బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన హుడా (29) కూడా హొస్సేన్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.