భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో వెస్టిండీస్ జట్టు పేలవమైన ప్రదర్శన చేసింది. భారత బౌలర్ల ధాటికి బ్యాటర్లంతా వచ్చిన వారు వచ్చినట్లే క్రీజు వదిలి పెవలియన్ చేరారు. జేసన్ హోల్డర్(57), ఫాబియాన్ అలెన్ (29) ఆదుకోకుంటే.. కనీసం పోరాడే స్కోరు కూడా చేయగలిగేది కాదీ జట్టు.
విధ్వంసకర జట్టుగా పేరున్న విండీస్లో ప్రమాకరమైన షాయి హోప్ (8), డారెన్ బ్రావో (18), నికోలస్ పూరన్ (18), కీరన్ పొలార్డ్ (0) తీవ్రంగా నిరాశపరిచారు. బ్రాండన్ కింగ్ (13), షార్మార్ బ్రూక్స్ (12), అకీల్ హొస్సేన్ (0), అల్జారి జోసెఫ్ (13) పరుగులు చేశారు. ఇలా బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో 79/7 స్కోరుతో నిలిచి, కనీసం వంద పరుగులైనా చేసేలా కనిపించని వెస్టిండీస్ను హోల్డర్, అలెన్ ఆదుకున్నారు.
వీళ్లిద్దరూ కలిసి 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ పార్టనర్షిప్ను వాషింగ్టన్ సుందర్ విడగొట్టాడు. అలెన్ అవుటైన కాసేపటికే హోల్డర్ను ప్రసిద్ధ్ కృష్ణ పెవిలియన్ చేర్చాడు. చివర్లో 44వ ఓవర్ ఐదో బంతికి జోసెఫ్ను అవుట్ చేసిన చాహల్.. విండీస్ ఇన్నింగ్స్ ముగించాడు. భారత బౌలర్లు అద్భుతంగా రాణించడంతో వెస్టిండీస్ జట్టు 43.5 ఓవర్లలో 176 పరుగులకు ఆలౌట్ అయింది. టీమిండియాలో మహమ్మద్ సిరాజ్ ఒక వికెట్ తీయగా.. చాహల్ 4, వాషింగ్టన్ సుందర్ 3, ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు పడగొట్టారు.