భారత్తో జరుగుతున్న రెండో వన్డేలో విండీస్ బ్యాటర్లు తడబడుతున్నారు. ఆరంభంలో బ్రాండన్ కింగ్ (18), షాయి హోప్ (27) భారత పేసర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. కానీ ప్రసిద్ధ్ కృష్ణ ఎంట్రీతో పరిస్థితి మారిపోయింది. తొలి ఓవర్లోనే కింగ్ను పెవిలియన్ చేర్చిన కృష్ణ.. తొలి పవర్ప్లే చివరి ఓవర్లో డారెన్ బ్రావో (1)ను కూడా అవుట్ చేశాడు. ఈ సమయంలో కృష్ణతోపాటు వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా విండీస్ బ్యాటర్లను తెగ ఇబ్బంది పెట్టాడు.
అతని శ్రమ ఫలించి ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ప్రమాదకర షాయి హోప్ పెవిలియన్ చేరాడు. లెగ్బ్రేక్ బంతిని భారీ షాట్ ఆడేందుకు హోప్ ప్రయత్నించాడు. కానీ అది సరిగా కనెక్ట్ కాకపోవడంతో అవుట్ఫీల్డ్లో ఉన్న సూర్యకుమార్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో హోప్ ఇన్నింగ్స్ ముగిసింది. వెస్టిండీస్ తాత్కాలిక కెప్టెన్ నికొలస్ పూరన్ క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం 17 ఓవర్లు ముగిసేసరికి విండీస్ జట్టు 61/3 స్కోరుతో నిలిచింది.