IND vs Srilanka | భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఇవాళ రెండో మ్యాచ్ జరుగుతోంది. కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్కు వేదిక కానుంది. టాస్ గెలిచిన ఆతిథ్య శ్రీలంక జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.
ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఎలాంటి మార్పులు చేయలేదు. తొలి వన్డేలో ఆడిన జట్టే ఈ మ్యాచ్లోనూ ఆడనుంది. అయితే శ్రీలంక జట్టులో మాత్రం రెండు మార్పులు జరిగాయి. హసరంగ, షిరాజ్ స్థానంలో కమిందు, వాండర్సే జట్టులోకి వచ్చారు. ఇరు జట్ల మధ్య ఇదే మైదానంలో జరిగిన తొలి వన్డే టైగా ముగిసిన సంగతి తెలిసిందే.
గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నప్పటికీ టీమిండియా సద్వినియోగం చేసుకోలేకపోయింది. 18 బంతుల్లో 5 పరుగులు చేస్తే గెలుస్తారనగా.. చివరి రెండు వికెట్లను వెంటవెంటనే కోల్పోయి విజయాన్ని చేజేతులా దూరం చేసుకుంది. నేటి మ్యాచ్ లోనూ టీమిండియా చేజింగ్ చేయాల్సి ఉండటంతో ఫలితం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.