IND vs SL : భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ తొలి వన్డేలో అర్థ సెంచరీ సాధించాడు. బంతుల్లో 47 బంతుల్లో50 రన్స్ చేశాడు. ధనంజయ డిసిల్వా వేసిన 36వ ఓవర్లో సిక్సర్ కొట్టి హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. కోహ్లీకి ఇది వన్డేల్లో 65వ అర్థ సెంచరీ. అతని ఇన్నింగ్స్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. అంతేకాదు ఈ ఫార్మాట్లో శ్రీలంక మీద అత్యధిక పరుగులు నమోదు చేశాడు. లంక మీద కోహ్లీ 2,264 రన్స్ కొట్టాడు. శ్రేయాస్ అయ్యర్ (28) క్యాచ్ అవుట్ కావడంతో టీమిండియా మూడో వికెట్ కోల్పోయింది. బౌండరీలు బాదుతూ లంక బౌలర్ల మీద ఒత్తిడి పెంచాడు. 35ఓవర్లలో భారత్ మూడు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. ప్రస్తుతం కోహ్లీ 52, రాహుల్ 24 రన్స్తో క్రీజులో ఉన్నారు.
టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన భారత్కు ఓపెనర్లు రోహిత్ (83), శుభ్మన్ గిల్ (70) శుభారంభం ఇచ్చారు. వీళ్లిద్దరూ తొలి వికెట్కు 143 పరుగులు జోడించారు.దసున్ షనక బౌలింగ్లో గిల్ ఎల్బీగా అవుట్ అయ్యాడు. కొంచెం సేపటికే హిట్మ్యాన్ బౌల్డ్ కావడంతో రెండో వికెట్ కోల్పోయింది. మధుషనక వేసిన ఓవర్లో రోహిత్ వెనుదిరిగాడు.