టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కెప్టెన్ రోహిత్ అనుకున్నట్లే ఆరంభంలో పిచ్ స్వింగ్కు సహకరించింది. దీంతో భారత పేసర్లు భువనేశ్వర్, బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశారు. వీరు మంచి నియంత్రణతో బౌలింగ్ చేయడంతో లంక బ్యాటర్లు పరుగులు చేయడానికి కష్టపడ్డారు. నాలుగు ఓవర్లు ముగిసే సరికి 15/0తో నిలిచిందా జట్టు. ఆ సమయంలో బౌలింగ్కు వచ్చిన హర్షల్ పటేల్ రెండు ఫోర్లు సమర్పించుకున్నాడు.
అతను వేసిన షార్ట్ బాల్ను గుణతిలక పుల్ చేసి బౌండరీకి తరలించాడు. ఆ తర్వాత వేసిన లెంగ్త్ బాల్ను నిస్సంక ముందుకొచ్చి బాదాడు. టాప్ ఎడ్జ్ తీసుకున్న బంతి బౌండరీకి వెళ్లింది. ఆరో ఓవర్లో బంతి అందుకున్న యుజ్వేంద్ర చాహల్ 7 పరుగులు ఇచ్చాడు. దీంతో తొలి పవర్ ప్లే ముగిసే సమయానికి శ్రీలంక జట్టు 32/0 స్కోరుతో నిలిచింది. భారత బౌలర్లు మంచి కంట్రోల్ కనబరచడంతో లంక బ్యాటర్లు స్వేచ్ఛగా షాట్లు ఆడలేకపోయారు.
That's the end of the powerplay and Sri Lanka are 32/0
Live – https://t.co/ImBxdhXjSc #INDvSL @Paytm pic.twitter.com/e6pg7QNlNv
— BCCI (@BCCI) February 26, 2022