శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్కు యువ ఓపెనర్ రుతురాజ్ సింగ్ దూరమయ్యాడు. మణికట్టు గాయం కారణంగా తొలి టీ20 మ్యాచ్ ఆడలేకపోయిన రుతురాజ్.. రెండో మ్యాచ్ ఆడతాడని అంతా అనుకున్నారు. కానీ అతనికి నొప్పి తగ్గలేదు. దీంతో అతనికి ఎంఆర్ఐ స్కాన్ తీశారు. ఆ తర్వాత నిపుణులను సంప్రదించారు. ఈ నేపథ్యంలోనే రుతురాజ్ మిగతా మ్యాచులు కూడా ఆడలేడని బీసీసీఐ తెలిపింది.
ఇప్పుడు రుతురాజ్.. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందనున్నాడు. రుతురాజ్ స్థానంలో మయాంక్ అగర్వాల్కు జట్టులో స్థానం కల్పించినట్లు బీసీసీఐ తెలిపింది. శ్రీలంకతో ఆడాల్సిన మిగతా రెండు టీ20లకు మయాంక్ అందుబాటులో ఉంటాడు. ఈ సిరీస్లో విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్కు విశ్రాంతినిచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, దీపక్ చాహర్ కూడా గాయాల కారణంగా లంక సిరీస్కు దూరమయ్యారు. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ కూడా గాయంతో బాధపడుతూ లంక సిరీస్లో ఆడటం లేదన్న సంగతి తెలిసిందే.
మిగతా టీ20లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయి, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), ఆవేశ్ ఖాన్, మయాంక్ అగర్వాల్.
NEWS – Ruturaj Gaikwad ruled out of T20I series.
More details here – https://t.co/wHy55tYKfx @Paytm #INDvSL pic.twitter.com/9WM1Iox0ag
— BCCI (@BCCI) February 26, 2022