తప్పక గెలవాల్సిన మ్యాచ్లో వెంటవెంటనే రెండు కీలక వికెట్లు పడ్డాయి. అలాంటి సమయంలో జట్టు బాధ్యతను భుజాలకు ఎత్తుకున్న టీమిండియా సారధి రోహిత్ శర్మ (53 నాటౌట్) అర్ధశతకంతో అదరగొట్టాడు. కేఎల్ రాహుల్ (6), విరాట్ కోహ్లీ (0) అవుటైన తర్వాత సూర్యకుమార్ యాదవ్ (17 నాటౌట్) అండగా రెచ్చిపోయిన రోహిత్.. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరుబోర్డును నడిపించాడు. పదో ఓవర్లో బౌండరీతో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు (32)ను రోహిత్ సమం చేశాడు. ఈ క్రమంలోనే పది ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 79/2 స్కోరుతో నిలిచింది.