శ్రీలంకతో జరుగుతున్న తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత జట్టుకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ (6) మరోసారి నిరాశపరిచాడు. ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్ రెండో ఓవర్లోనే రాహుల్ అవుటయ్యాడు. తీక్షణ వేసిన ఆ ఓవర్ నాలుగో బంతికి బౌండరీ బాదిన అతను.. తర్వాతి బంతిని కూడా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు.
ముందుకొచ్చి బంతిని లెగ్సైడ్ ఆడేందుకు ట్రై చేశాడు. అయితే అతని బ్యాటును తాకని బంతి రాహుల్ బూట్కు తగిలింది. దీంతో లంక ప్లేయర్లు అప్పీల్ చేయగా.. అంపైర్ అవుటిచ్చాడు. రాహుల్ రివ్యూ కోరినా ఫలితంలో మార్పు రాలేదు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కాసేపటికే విరాట్ కోహ్లీ (0) డకౌట్ అయ్యాడు. మధుశంక వేసిన మూడో ఓవర్లో బంతిని లెగ్సైడ్ ఆడేందుకు ప్రయత్నించిక కోహ్లీ మిస్సయ్యాడు. దాంతో అది నేరుగా వెళ్లి వికెట్లను కూల్చింది. దీంతో భారత జట్టు 13 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.