ఆసియా కప్లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో భారత బ్యాటింగ్ తడబడుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ (72) అవుటైన కాసేపటికే సూర్యకుమార్ యాదవ్ (34) కూడా పెవిలియన్ చేరాడు. లంక సారధి దాసున్ శనక వేసిన 15వ ఓవర్ రెండో బంతికి సూర్యకుమార్ అవుటయ్యాడు. షార్ట్ బాల్ను ర్యాంప్ చేసేందుకు ప్రయత్నించిన సూర్య విఫలమయ్యాడు. బ్యాట్ సరిగా కనెక్ట్ కాకపోవడంతో షార్ట్ థర్డ్లో ఉన్న తీక్షణ సులభమైన క్యాచ్ అందుకున్నాడు. దాంతో సూర్యకుమార్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత జట్టు 119 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.