IND vs SL : గెలుపు దిశగా పయనిస్తున్న భారత్కను కరుణరత్నే దెబ్బకొట్టాడు. హార్దిక్ పాండ్యా (36) ఐదో వికెట్గా వెనక్కి పంపాడు. కరుణరత్నే బౌలింగ్లో కీపర్ కుశాల్ మెండిస్ క్యాచ్ అందుకోవడంతో అతని ఇన్నింగ్స్కు తెరపడింది. రాహుల్తో కలిసి అతను ఐదో వికెట్కు అర్థ సెంచరీ (75) భాగస్వామ్యం నిర్మించాడు. కేఎల్ రాహుల్ 43, అక్షర్ పటేల్ 1 క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి 93 బంతుల్లో 53 పరుగులు కావాలి. ప్రస్తుతం టీమిండియా స్కోర్.. 165/5.