దుబాయ్: మళ్లీ జడేజానే. డ్రింక్స్ విరామం తర్వాత షమీ వేసిన ఓవర్లో స్కాట్లాండ్ బ్యాట్స్మెన్ లీస్క్ (21) ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టి సత్తా చాటాడు. అతను నిలబడితే ఆ జట్టు పోరాడే స్కోరు చేయగలిగేలా కనిపించింది. అలాంటి సమయంలోనే తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లు కూల్చిన జడ్డూను మరోసారి కోహ్లీ నమ్ముకున్నాడు.
కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టుకున్న జడేజా.. రెండో బంతికే లీస్క్ను ఎల్బీగా పెవిలియన్ చేర్చి భారత్కు మరోసారి బ్రేక్ ఇచ్చాడు. దీంతో 12 ఓవర్లకు స్కాట్లాండ్ జట్టు 60/5 స్కోరుతో నిలిచింది.