ఢిల్లీ వేదికగా ఇండియా-దక్షిణాఫ్రికా మధ్య గురువారం జరిగిన తొలి టీ20 లో మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు బాహాబాహీకి దిగారు. ఒకవైపున సిక్సర్లు, ఫోర్లతో బ్యాటర్లు హోరెత్తిస్తుంటే.. అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈస్ట్ స్టాండ్ లో మ్యాచ్ చూస్తున్న పలువురు ప్రేక్షకులు మాత్రం ఒకరిమీద ఒకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు.
తొలి టీ20 జరుగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈస్ట్ స్టాండ్ లోని పలువురు ప్రేక్షకులు గొడవకు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నది. వీడియోలో.. ఇద్దరు ఒకవైపు మరో ఐదారుగురు ఒక వైపు ఉండి కొట్టుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు వచ్చి ఘర్షణ పడుతున్న వారిని పక్కకు తీసుకెళ్లారు.
ఆ క్రమంలో అక్కడ ఉన్న ప్రేక్షకులంతా మ్యాచ్ ను మానేసి వీళ్ల గొడవనే చూస్తుండిపోయారు. అయితే ఈ గొడవకు గల కారణాలేంటి..? వాళ్లు ఎందుకు కొట్టుకున్నారు..? అనేదానిమీద వివరాలేమీ తెలియరాలేదు.
ఇక తొలి టీ20 లో భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (76), శ్రేయస్ అయ్యర్ (36), హార్ధిక్ పాండ్యా (31) లు రాణించారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 19.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 212 పరుగులు చేసింది. రస్సి వాన్ డెర్ డసెన్ (75), డేవిడ్ మిల్లర్ (64) లు రెచ్చిపోయి ఆడి సఫారీలకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు.
Exclusive video from #QilaKotla yesterday East Stand pic.twitter.com/CXgWMOse87
— Pandit Jofra Archer (@Punn_dit) June 10, 2022